జనసేన ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం.. నాదెండ్ల మనోహర్

Dec 9, 2022, 5:49 PM IST

శ్రీకాకుళం :  జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువ శక్తి అనే కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని. దీన్ని ఒక యువజనోత్సవంగా వేడుక నిర్వహిస్తామని తెలిపారు. 12వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యువత కు భరోసా ఇవ్వడానికి ఈకార్యక్రమాన్నినిర్వహిస్తున్నామని తెలిపారు. వారాహి విషయంలో ముందే కొందరు ప్రెస్ మీట్ పెట్టి కంగారు పడిపోతున్నారని ఎద్దేవా చేశారు.