విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం... ప్రముఖ బట్టల షోరూంలో తనిఖీలు

May 2, 2023, 6:13 PM IST

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వస్త్రవ్యాపార సముదాయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోని  కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి షోరూంలలో ఉదయం నుండి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. విజయవాడ బందరు రోడ్డులోని వరమహాలక్ష్మి సిల్స్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.  పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.