కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్యులు నెలలో కనీసం ఒక రోజు గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాల్లో సేవలందించాలని విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ సమాజానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.