పాక ఇడ్లి సెంటర్ లో వెంకయ్యనాయుడు ... వేడి వేడి ఇడ్లిలను లొట్టలేసుకుంటూ తిన్న మాజీ ఉపరాష్ట్రపతి

May 2, 2023, 6:17 PM IST

విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయూస్  కాలనీ ఎస్ఎస్ఎస్ ఇడ్లీ సెంటర్ (పాక ఇడ్లీ) తెలియని వారు వుండరు. ఇక్కడ నేతి ఇడ్లీలను తినేందుకు ప్రజలు బారులు తీరుతుంటారు. ఈ రుచికరమైన నేతి ఇడ్లీలను తినేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ఇవాళ ఉదయం ఎస్ఎస్ఎస్ టిఫిన్ సెంటర్ కు చేరుకున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి పాక ఇడ్లీ సెంటర్ వద్దకు వెళ్లి నేతి ఇడ్లీలు చాలా ఇష్టంగా తిన్నారు వెంకయ్యనాయుడు.