రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం... జనజాగరణ సమితి వినూత్న నిరసన

May 2, 2023, 5:03 PM IST

విశాఖపట్నం రుషికొండలోని ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లే దారిలో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వాగతం- సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోతారని... రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అంతటి గొప్ప రికార్డు సృష్టించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా సన్మానం చేసి "క్యాపిటల్ లెస్ సీఎం" బిరుదు ఇవ్వాలని సెటైర్లు వేశారు.