గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి: విజయశాంతి

Published : Jun 30, 2023, 12:50 PM IST
 గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలి: విజయశాంతి

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై  విధించిన  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని  బీజేపీ నాయకత్వాన్ని  కోరారు  విజయశాంతి.

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ఎత్తివేయాలని సినీ నటి, బీజేపీ నేత  విజయశాంతి  కోరారు.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ అంశంలో బీజేపీ నాయకత్వం నిర్ణయం ఆలస్యమౌతుందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని  ఆమె  కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విజయశాంతి  కోరారు.


2022 ఆగస్టు మాసంలో  మహ్మద్ ప్రవక్తపై  వివాదాస్పద వ్యాఖ్యలను  సోషల్ మీడియాలో పోస్టు చేశారని రాజాసింగ్ పై  పోలీసులు  కేసు నమోదు  చేశారు. ఈ విషయమై  బీజేపీ నాయకత్వం  రాజాసింగ్ పై  సస్పెన్షన్ వేటేసింది.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని పార్టీలో  నేతలు  కోరుతున్నారు.  రాజాసింగ్ పై  సస్పెన్షన్ ను ఎత్తివేయాలని రాష్ట్రానికి చెందిన  నేతలు  పార్టీ జాతీయ నాయకత్వాన్ని  కోరారు.   
 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu