
సైబర్ నేరాల నుండి సామాన్య ప్రజలను రక్షించడంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల లావాదేవీల్లో అనుమానాస్పద మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, ఫేక్ కాల్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ వంటి ఉచ్చుల్లో చిక్కుకున్నవారు హుటాహుటిన డబ్బు విత్డ్రా చేయడం, బంగారంపై అప్పులు తీసుకోవడం వంటి చర్యలకు దిగుతున్నారు.