Telangana rains: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యట‌న‌.. కేసీఆర్ స‌ర్కారుపై ఫైర్

Published : Jul 29, 2023, 11:11 AM IST
Telangana rains: వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యట‌న‌.. కేసీఆర్ స‌ర్కారుపై ఫైర్

సారాంశం

Hyderabad: కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కులు జీ.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలుసుకునీ, అధికారులతో మాట్లాడి మురుగు కాల్వలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.   

Telangana rains: కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కులు జీ.కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలుసుకునీ, అధికారులతో మాట్లాడి మురుగు కాల్వలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌కృతి విప‌త్తుల‌ను ముందుచూపుతో ఎదుర్కొవ‌డంలో కేసీఆర్ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లో చాలా ప్రాంతాలు నీట‌మునిగాయి. ఈ క్రమంలోనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటించారు. అధికారులతో మాట్లాడి మురుగు కాల్వలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాలపై మాత్రమే ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి విమ‌ర్శించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోని పౌర సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఇదిలావుండగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ముందుచూపు కేసీఆర్ ప్రభుత్వానికి లేదని బీజేపీ తెలంగాణ విభాగం ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

వర్షాలకు జరిగిన నష్టం, ప్రభుత్వ వైఫల్యం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల కష్టాలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపించిన బీజేపీ సీనియర్ నేత, అధికార పార్టీ నాయకులు చెరువుల భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారనీ, పలు చెరువుల పూడికతీతలో ప్రభుత్వ వైఫల్యం వల్ల హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి పొంగిపొర్లుతున్న చెరువుల నీరు చేరిందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?