హైదరాబాద్ పరిధిలో ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. రెండు సరికొత్త ఆఫర్స్ ప్రకటన..

Published : Mar 09, 2023, 04:18 PM IST
హైదరాబాద్ పరిధిలో ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. రెండు సరికొత్త ఆఫర్స్ ప్రకటన..

సారాంశం

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులుకు తెలంగాణ ఆర్టీసీ మరో రెండు సరికొత్త ఆఫర్‌లను తీసుకొచ్చింది. టీ-6, ఎఫ్-24 పేర్లతో ఈ ఆఫర్లను ప్రకటించింది. 

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులుకు తెలంగాణ ఆర్టీసీ మరో రెండు సరికొత్త ఆఫర్‌లను తీసుకొచ్చింది. టీ-6, ఎఫ్-24 పేర్లతో ఈ ఆఫర్లను ప్రకటించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌యాణించేవారికి ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఈ టికెట్ల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ గురువారం ఆవిష్క‌రించారు. టీ-24 మాదిరిగానే ఈ టికెట్లను కూడా ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను కోరింది. 

ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని చెప్పారు. వారిలో 55.50 లక్షల మంది టీ-24 టిక్కెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. నగరంలోని ప్రయాణీకులకు, పర్యాటకులకు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సౌకర్యవంతంగా చేయడానికి టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్ఆర్టీసీ ప్రారంభించిందని తెలిపారు.

టీ-6 ఆఫర్ విషయానికి వస్తే.. ఇది మహిళలు, సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంది. దీని ధరను రూ. 50గా నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఆరు గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణించే వారికే ఇది వర్తించనుంది.

ఎఫ్-24 విషయానికి వస్తే..  ఇది కలిసి ప్రయాణించాలనుకునే కుటుంబం, స్నేహితుల సమూహాల కోసం రూపొందించబడింది. ఈ టిక్కెట్ ధర రూ. 300. ఈ టికెట్ ద్వారా హైదరాబాద్ సబర్బన్ పరిమితుల్లో వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో నలుగురితో కూడిన బృందం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎఫ్-24 టిక్కెట్‌ను కొనుగోలు చేసినప్పటీ నుంచి 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో  ప్రయాణించవచ్చు. ఈ టికెట్ శని, ఆదివారాలతో పాటు పబ్లిక్ హాలిడ్సే‌లో మాత్రమే వర్తించనుంది.

ఇక, ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీ-24 టికెట్‌ను ఆర్టీసీ సంస్థ అందజేస్తోంది. 24 గంటల పాటు ఆ టికెట్‌ చెల్లుబాటు అవుతుంది. ఆ టికెట్‌ ధర పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 60గా ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu