టీఆర్ఎస్ అంటే ఏంటో చూస్తారు: కేంద్రానికి కేకే అల్టీమేటం

Siva Kodati |  
Published : Sep 10, 2020, 07:28 PM ISTUpdated : Sep 10, 2020, 07:31 PM IST
టీఆర్ఎస్ అంటే ఏంటో చూస్తారు: కేంద్రానికి కేకే అల్టీమేటం

సారాంశం

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు. ఇన్నాళ్లూ కేంద్రానికి సహకరించామని.. ఇకపై ఏం అంశంలోనూ రాజీపడమని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు. ఇన్నాళ్లూ కేంద్రానికి సహకరించామని.. ఇకపై ఏం అంశంలోనూ రాజీపడమని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో తామేం చేస్తామో.. మీరే చూస్తారని కేకే వ్యాఖ్యానించారు. సమస్యలపై రాజీ పడేది లేదని... జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోతే ఎలా ఊరుకుంటామని ఆయన నిలదీశారు.

తమకు ప్రజలే ముఖ్యమని కేశవరావు స్పష్టం చేశారు. కేంద్రం అసమర్థత వల్ల రాష్ట్రాలు, ప్రజలు ఇబ్బంది పడాలా అని ఎంపీ ప్రశ్నించారు. 

అంతకుముందు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ ఎంపీలు, కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu