రైల్వే పోలీసులు పెట్టినవి తప్పుడు కేసులేనట

Published : Jun 29, 2017, 11:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
రైల్వే పోలీసులు పెట్టినవి తప్పుడు కేసులేనట

సారాంశం

పంచ్ డైలాగులకు పెట్టింది పేరైన తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మరోసారి పంచ్ డైలాగ్ పేల్చారు. తెలంగాణ రాకముందు రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లిన తమపై రైల్వే పోలీసులు తప్పుడు కేసులు పెట్టిర్రని ఆరోపించారు నాయిని. గురువారం రైల్వే కోర్టు కే హోమంత్రి నాయిని, మంత్రి కెటిఆర్ ఇతర టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.

పంచ్ డైలాగులకు పెట్టింది పేరైన తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మరోసారి పంచ్ డైలాగ్ పేల్చారు. తెలంగాణ రాకముందు రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లిన తమపై రైల్వే పోలీసులు తప్పుడు కేసులు పెట్టిర్రని ఆరోపించారు నాయిని. గురువారం రైల్వే కోర్టు కే హోమంత్రి నాయిని, మంత్రి కెటిఆర్ ఇతర టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా నాయిని నమాట్లాడుతూ రైల్వే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రైల్వేస్టేషన్ కు వెళ్లిన మాట నిజమే కానీ, రైళ్లు ఆపలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయానే జడ్జికి కూడా చెప్పినం అని నాయిని వివరించారు. కేసు వచ్చేనెల 19కి వాయిదా పడింది.

 

మొత్తానికి పోలీసులు తప్పుడు కేసులు పెడతారన్న విషయాన్ని స్వయానా పోలీసు మంత్రే చెప్పడంతో చర్చనీయాంశమైంది. మరి నాయిని గారు మీ కింద పనిచేస్తున్న పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టగాలే జాగ్రత్త అని నెటిజన్లు చురకలేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే