Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 10 వేల కోట్ల ఆదాయమే ల‌క్ష్యంగా

Published : Jun 13, 2025, 04:17 PM IST
Telangana Chief Minister A Revanth Reddy (File photo/ANI)

సారాంశం

తెలంగాణ ప్ర‌భుత్వం ఆదాయం పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ. 10,000 కోట్ల ఆదాయం రావ‌డ‌మే ల‌క్ష్యంగా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో వ్యవసాయ భూములు, నిర్మాణ భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది గత మూడు సంవత్సరాల తరువాత జరుగుతున్న మార్పు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే మొదటి సారి. ఈ కొత్త రేట్లు జూలై 2025 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ మార్పుతో ప్రభుత్వానికి రూ.10,000 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఈ సిఫారసులను స్వీకరించారు. ఆయన ఉన్నతాధికారులతో భూమి విలువ పెంపుపై చర్చించారు. అనంతరం ఈ వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.

ఏరియా వారీగా భూముల విలువలు పెరిగేలా సిఫారసులు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన మార్కెట్ విలువల కమిటీలు ప్రాంతాల వారీగా భూముల విలువలు పెంచేలా ప్రతిపాదనలు చేశాయి. గ‌తంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021, 2022లో భూముల విలువలను భారీగా పెంచారు. అప్పట్లో వ్యవసాయ భూముల విలువ 150% వరకు, నాన్ అగ్రికల్చరల్ భూములు (ఓపెన్ ప్లాట్లు) విలువను 100% వరకు పెంచారు.

2021లో రేట్లు పెరగ్గా స్టాంప్ డ్యూటీ 2022లో పెరిగింది

2021లో భూముల మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ, స్టాంప్ డ్యూటీ 2022 జూలైలో మాత్రమే 6% నుంచి 7.5%కి పెంచారు. కానీ ఇప్పటి భూముల రేట్లతో చూస్తే, అప్పుడు నిర్ణయించిన కనీస వ్యవసాయ భూముల విలువ రూ.75,000 మాత్రమే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆ రేటుకు ఎక్కడా భూములు లేవని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల ఈ రేటును రెండింతలు పెంచే యోచనలో ఉంది.

కాగా గ‌తంలో ఓపెన్ ప్లాట్ల కనీస విలువ రూ.100 నుంచి రూ.200కి పెరిగింది. ఇప్పుడు మరోసారి 20% నుంచి 40% మధ్య పెంపు చేయాలని అధికారులు సూచించారు. స్టాంప్ డ్యూటీని కొద్దిగా పెంచే అవకాశం ఉందని సమాచారం.

వాయిదా ప‌డింది.

2024 సాధారణ ఎన్నికలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనంతో రియల్ ఎస్టేట్ నెమ్మదిగా నడవడంతో ఈ ప్రతిపాదన వాయిదా పడింది. అయితే గతేడాది మే నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి భూముల విలువలు పెంచాలని సూచించారు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో భూముల ధరలు అమాంతం పెరగగా, ప్రభుత్వ ఆదాయం మాత్రం అంతగా పెరగలేదు. అందుకే నిబంధనల ప్రకారం మార్కెట్ రేట్లు పెంచి, ఆదాయం పెంచాలని సీఎం భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu