Kishan Reddy: "దేశానికి మళ్లీ మోదీ నాయకత్వం అవసరం"  

By Rajesh KarampooriFirst Published Mar 3, 2024, 3:12 AM IST
Highlights

Kishan Reddy:  ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ జి కిషన్‌రెడ్డి అన్నారు. 

Kishan Reddy: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, తొమ్మిదిన్నరేళ్లుగా అందరి ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. 

తాము దివ్యాంగుల రిజర్వేషన్లు మూడు నుంచి నాలుగు శాతానికి పెంచామని చెప్పారు. గతంలో వారి సుదీర్ఘ పోరాటంతో వికలాంగుల పింఛను వారి సంక్షేమానికి మోదీ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్న తదుపరి లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. గత తొమ్మిదిన్నరేళ్లలో మోదీ తన పాలనలో అవినీతి రహితంగా, ప్రజలకు శాంతి భద్రతలతో పాటు బలహీనులు, బలహీనవర్గాల సంక్షేమాన్ని అందించారని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ఎన్ని విజయాలను సాధించిందనీ, ఆయనను మరోసారి ప్రధానిగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ నేప‌థ్యంలో మోదీ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, దేశం కోసం ఓటు వేయ‌డం, వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తు, పేద‌ల సంక్షేమం గురించి ప్ర‌జ‌ల్లో చైతన్యం తీసుకురావడానికి పార్టీ యాత్ర చేపట్టింది.

కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లో మోడీ నాయకత్వం దేశం ప్రగతి మార్గంలో నడిచిందని తెలిపారు.  ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాలలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ఐఎస్ఐ కార్యకలాపాలను ఉక్కు హస్తంతో అణచివేసిందని ఆయన గుర్తు చేశారు. నేడు భారత దేశాన్ని ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయని , మోడీ ప్రపంచ నాయకుడిగా కూడా ఉద్భవించాడని తెలిపారు. అన్ని సర్వేలు ప్రజల ప్రజాదరణలో మోడీ అగ్రస్థానంలో ఉన్నాయని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని తెలిపారు. మరోవైపు అవినీతిని ఆరోపిస్తూ మోదీపై వేలు పెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారనీ,  దేశం, భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసం.. మోదీని ఆశీర్వదించి మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనేది ప్రజలేనని అన్నారు.  

click me!