జవహర్ నగర్ లో యువతిని వివస్త్రను చేసిన కీచకుడు : తమిళిసై సీరియస్.. డీజీపీ, సీఎస్‌లను నివేదిక కోరిన గవర్నర్

Siva Kodati |  
Published : Aug 09, 2023, 06:15 PM ISTUpdated : Aug 09, 2023, 06:21 PM IST
జవహర్ నగర్ లో యువతిని వివస్త్రను చేసిన కీచకుడు : తమిళిసై సీరియస్.. డీజీపీ, సీఎస్‌లను నివేదిక కోరిన గవర్నర్

సారాంశం

హైదరాబాద్ జవహర్ నగర్‌లో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను ఆమె ఆదేశించారు.   

హైదరాబాద్ జవహర్ నగర్‌లో మహిళను వివస్త్రను చేసిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు నివేదిక సమర్పించాల్సిందిగా సీఎస్, డీజీపీలను ఆమె ఆదేశించారు. 

అసలేం జరిగిందంటే :

మద్యం మత్తులో ఓ కామాంధుడు యువతిపై దారుణానికి తెగబడ్డాడు. ఈ నెల 6న హైదరాబాద్‌ జవహర్‌నగర్‌లో ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో మారయ్య అనే వ్యక్తి ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ హఠాత్ పరిణామానికి షాకైన ఆ యువతి అతనిని దూరంగా నెట్టేసింది. దీంతో ఆ కీచకుడు ఆమెపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె బట్టలను చించి లాగేశాడు. ఆమె దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపై నగ్నంగా పడివున్నా పట్టించుకున్న వారు లేరు. అంతా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించగా.. జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. 

Also Read: హైద్రాబాద్‌ జవహర్ నగర్ లో యువతిని వివస్త్ర చేసిన కేసు: వారం రోజుల్లో నివేదిక కోరిన జాతీయ మహిళ కమిషన్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే