లాక్‌డౌన్: తెలంగాణలో ఈ-కామర్స్, పుడ్‌డెలివరీ యథాతథం

Published : May 23, 2021, 10:35 AM IST
లాక్‌డౌన్: తెలంగాణలో ఈ-కామర్స్, పుడ్‌డెలివరీ యథాతథం

సారాంశం

 తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సేవలకు యధాతథంగా కొనసాగుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సేవలకు యధాతథంగా కొనసాగుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో లాక్‌డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో  పుడ్ డెలివరీతో పాటు ఈ కామర్స్ సేవలు యధాతథంగా కొనసాగతాయని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. శనివారం నాడు పలు ఈ కామర్స్ సిబ్బంది వాహనాలను సీజ్ చేశారు. అంతేకాదు  ఉదయం 10 గంటల తర్వాత  ఈ కామర్స్ సేవలకు ఆటంకం కల్గించారు. 

alsoread :ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి వాహనాల అనుమతి: తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు

ఈ విషయమై ఈ కామర్స్ ప్రతినిధులు  మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలతో ఈ విషయమై మాట్లాడారు. ఈ కామర్స్ సంస్థల ప్రతినిధులతో పాటు పుడ్ డెలివరీ కి ఎలాంటి ఇబ్బందులు లేవని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం నాడు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ