సంగారెడ్డి జిల్లాలో టెక్కీ అదృశ్యం:పోలీసుల గాలింపు

Published : Nov 16, 2022, 12:26 PM ISTUpdated : Nov 16, 2022, 01:10 PM IST
సంగారెడ్డి జిల్లాలో టెక్కీ అదృశ్యం:పోలీసుల గాలింపు

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి పవన్ అదృశ్యమయ్యాడు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సంగారెడ్డి:జిల్లాలోని అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి పవ,న్ అదృశ్యమయ్యాడు. సాయి పవన్  కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.సాయి పవన్ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి రూ. 10 లక్షలు నష్టపోయాడు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను మందలించారు. కుటుంబసభ్యులు మందలించడంతో మనోవేదనకు గురైన సాయి పవన్ ఇంటి నుండి వెళ్లిపోయాడు.ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సాయి పవన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

షేర్ మార్కెట్లో పెట్టుబడలు పెట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి షేర్ మార్కెట్ లో పెట్టుబడుల  విషయమై నిపుణుల సూచనలు తీసుకోవాలని ఆర్ధికనిపుణులు సూచిస్తున్నారు.అయితే సాయి పవన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి టెక్కీ సాయి పవన్ రూ. 10 లక్షలు నష్టపోయినట్టుగా కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

South Central Railway Announces Special Trains for Sankranthi 2026 | Pongal | Asianet News Telugu
Hyderabad History: నిజాంలనాటి చివరిగుర్తులు, మిగిలింది ఇవే..