ప్రవీణ్, రాజశేఖర్‌లదే కీలకపాత్ర: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై హైకోర్టుకు సిట్ నివేదిక

Published : Apr 11, 2023, 12:00 PM ISTUpdated : Apr 11, 2023, 01:45 PM IST
ప్రవీణ్, రాజశేఖర్‌లదే  కీలకపాత్ర: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌పై  హైకోర్టుకు  సిట్  నివేదిక

సారాంశం

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  అంశంపై  సిట్ అధికారులు  మంగళవారంనాడు   హైకోర్టుకు  నివేదికను సమర్పించారు.   

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  లో  ప్రవీణ్, రాజశేఖర్ లు కీలకంగా వ్యవహరించారని  సిట్  బృందం  హైకోర్టుకు నివేదిక  సమర్పించింది.   తెలంగాణ హైకోర్టుకు  సిట్  అధికారులు  మంగళవారంనాడు నివేదికను  అందించారు.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్, ఆ తర్వాత  చోటు  చేసుకున్న పరిణామాలపై  సిట్  అధికారులు హైకోర్టుకు  నివేదికను అందించింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై  సిట్  విచారణపై  స్టేటస్ రిపోర్ట్  ఇవ్వాలని హైకోర్టు  ఈ ఏడాది మార్చి  21న ఆదేశించింది. దీంతో  ఇవాళ  హైకోర్టుకు సిట్  బృందం  స్టేటస్ రిపోర్టును అందించింది. 

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై  సిట్  విచారణపై  స్టేటస్ రిపోర్ట్  ఇవ్వాలని హైకోర్టు  ఈ ఏడాది మార్చి  21న ఆదేశించింది. దీంతో  ఇవాళ  హైకోర్టుకు సిట్  బృందం  స్టేటస్ రిపోర్టును అందించింది.

also read: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లో రంగంలోకి ఈడీ: శంకరలక్ష్మికి నోటీసులు

ప్రవీణ్ , రాజశేఖర్ లు  క్వశ్చన్ పేపర్లు   లీక్ చేసి  అమ్ముకున్నారని సిట్  హైకోర్టుకు  సమర్పించిన  నివేదికలో  పేర్కొంది. ఈ కేసులో  17 మందిని  అరెస్ట్  చేసినట్టుగా ఆ నివేదిక  పేర్కొంది.  మరో వైపు ఈ కేసులో  450  మంది సాక్షులను విచారించినట్టుగా  సిట్  పేర్కొంది. పేపర్ లీక్   కారణంగా  ఆరు పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ రద్దు  చేసిందని  హైకోర్టుకు  సిట్  నివేదికను ఇచ్చింది. టీఎస్‌పీఎస్‌సీలో  పనిచేస్తూ   కొందరు  ఉద్యోగులు  గ్రూప్స్  పరీక్షలు  రాశారని  ఆ నివేదిక  పేర్కొంది.  అంతేకాదు  ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి , రేణుక  ఫోన్లకు  సంబంధించి  ఫోరెన్సిక్  నివేదికను  కూడా  కోర్టుకు  సమర్పించారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!