మంచిర్యాల సభలో కేసిఆర్ కు మహిళల షాక్ (వీడియో)

First Published Feb 27, 2018, 8:51 PM IST
Highlights
  • సభలో కేసిఆర్ మాట్లాడుతుండగా మహిళల ఆందోళన
  • సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్

తెలంగాణ సిఎం కేసిఆర్ కు మంచిర్యాల సభలో మహిళల నుంచి షాక్ ఎదురైంది. సిఎం కేసిఆర్ ప్రసంగిస్తుండగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కావాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పట్టుకుని సభ బయటకు తీసుకువెళ్లేందుకు ఇటు మహిళా పోలీసులు.. అటు మగ పోలీసులు ఎంతగా శ్రమించారో ఈ కింద ఉన్న వీడియో చూడండి.

click me!