‘ముంబై’ డాన్ ఎవరు...!

First Published Feb 23, 2017, 10:33 AM IST
Highlights

శివసేన ప్రాంతీయ వాదంతో మరోసారి  సత్తా చాటింది.

 

ముంబైలో  పెద్ద పులి గర్జించింది. కమలం వికసించింది. విడిపోయి విజయం సాధించినా ఎవరికీ అనుకున్న ఫలం మాత్రం దక్కలేదు.  

బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. బీఎంసీలోని మొత్తం 227 వార్డులకు గాను 226 స్థానాల ఫలితాలు వచ్చాయి. వీటిలో శివసేన 84 స్థానాల్లో జయకేతనం ఎగరవేయగా, బీజేపీ  81 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంది. అయితే ఈ ఫలితంతో ముంబై డాన్ ఎవరూ అనేది తేలే పరిస్థితి కనిపించడం లేదు.

 

సుదీర్ఘకాలంగా కలసిని ఎన్నికలకు వెళ్లిన శివసేన, బీజేపీ ఇప్పుడు ఒంటరిపోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే అధికారం పంచుకునేందుకు ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయా లేదా అనేది తెలియడం లేదు. ఎందకంటే ఈ రెండు పార్టీలు ఇతర పార్టీలతో కలసే అవకాశం దాదాపు లేదు.  

 

కాగా, ఈ సారి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ పరిచింది. కేవలం 31 స్థానాలు గెలుచుకొని తన ఉనికిని కాపాడుకుంది. ఎన్సీపీ కూడా నిరాశే ఎదురైంది. కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) 9 స్థానాల్లో గెలిచి పరువు నిలబెట్టుకుంది.

 

ఫలితాలు వెలువడక ముందు బీజేపీ దే గెలుపు అని రాజకీయ నాయకులు విశ్లేషించారు. ముఖ్యంగా శివసేన తన చిరకాల నేస్తం బీజేపీని వదలి ఒంటిరిపోరుకు సై అన్న నేపథ్యంలో ఈ ప్రాంతీయ పార్టీకి చావు దెబ్బతప్పదని భావించారు. 

 

కానీ, ఫలితం మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. శివసేన తన ప్రాంతీయ వాదంతో మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

 

 

click me!