టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు షాక్‌

Published : Jun 12, 2017, 02:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు షాక్‌

సారాంశం

టిఎస్ పిఎస్‌సికి  హైకోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ 2 లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ నిలిపివేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 2 నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కొంద‌రు నిరుద్యోగులు కోర్టు త‌లుపు త‌ట్టారు.

 

టిఎస్ పిఎస్‌సికి  హైకోర్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ 2 లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ నిలిపివేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 2 నిర్వ‌హ‌ణ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని కొంద‌రు నిరుద్యోగులు కోర్టు త‌లుపు త‌ట్టారు.

దీంతో స్పందించిన హైకోర్టు మూడు వారాల పాటు గ్రూప్ 2 నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ జ‌ర‌ప‌రాద‌ని ఆదేశించింది.

మూడు వారాల్లోగా కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ స‌ర్కారును ఆదేశించింది.
1032 పోస్టుల‌కు గ‌త నవంబ‌రులో ప‌రీక్ష నిర్వ‌హించింది టిఎస్‌పిఎస్‌సి 

దేశంలోనే ఏ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చేయ‌ని రీతిలో ఆన్‌లైన్ లో అద్భుతంగా గ్రూప్‌2 ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్న టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు తీర్పు చెంప పెట్టు అని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు.  లోప‌భూయిష్టంగా గ్రూప్ 2 నిర్వ‌హ‌ణ సాగుతోంద‌ని గ‌త కొంత కాలంగా అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చ‌ర్య  స‌ర్కారుకు మింగుడు ప‌డ‌ని అంశంగా చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా