తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

telangana elections 2023 : హరీష్ రావు అతివాగుడు వల్లే రైతుబంధు ఆగింది.. రేవంత్ రెడ్డి

Bukka Sumabala | Published : Nov 27, 2023 1:16 PM

హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కావాలనే బీఆర్ఎస్ రైతుబంధును ఆపించిందని అన్నారు. 

హైదరాబాద్ : రైతుబంధు ఆగడానికి కాంగ్రెస్ కారణం అని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. నిజానికి రైతుబంధు ఆగడానికి హరీష్ రావు అతివాగుడే కారణం అన్నారు. రైతుబంధు రాకుండా చేసిన  బిఆర్ఎస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

రైతుబంధు పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఆగడానికి బీఆర్ఎస్ కుట్ల చేసిందన్నారు. రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఎకరాకు రూ. 15000ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దే అన్నారు. రైతు బందు ఇవ్వాలని ఈసీకి మేము విజ్ఞప్తి చేశాం ఈజీ కూడా అనుమతిని ఇచ్చింది. కానీ బీఆర్ఎసే రైతుబంధును అడ్డుకుందన్నారు. 

click me!