రేపు విచారణకు హాజరు కాలేను: ఈడీకి కవిత లేఖ

Published : Mar 08, 2023, 12:48 PM ISTUpdated : Mar 08, 2023, 01:04 PM IST
రేపు విచారణకు  హాజరు కాలేను: ఈడీకి  కవిత  లేఖ

సారాంశం

రేపు విచారణకు  హాజరు కాలేనని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఈడీకి  లేఖ రాశారు.  ఈ నెల  15 తర్వాత  విచారణకు  హాజరయ్యేందుకు  ఆమె  సుముఖతను వ్యక్తం  చేశారు.  

హైదరాబాద్:  రేపు విచారణకు  హజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఈడీకి తెలిపారు. ఈ మేరకు  బుధవారం నాడు కవిత  ఈడీకి లేఖ రాశారు.  ఈ నెల  15వ తేదీన  తర్వాత  విచారణకు  హాజరుకానున్నట్టుగా  కవిత  ఆ లేఖలో  పేర్కొన్నారు. 

ఈ  నెల  10వ తేదీన  ఢిల్లీలో  దీక్ష  ఉందని   ఆ లేఖలో  కవిత  పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దీక్షకు సంబంధించి  ఏర్పాట్లు  కూడా  పూర్తయ్యాయని  కూడా  కవిత  పేర్కొన్నారు.  ఈ దీక్ష  నేపథ్యంలో  రేపు విచారణకు  హాజరు కాలేనని కవిత  పేర్కొన్నారు.  ఈ నెల  15వ తేదీ తర్వాత  విచారణకు  హాజరయ్యేందుకు  సానుకూతను వ్యక్తం  చేశారు.   ఈ నెల  9వ తేదీ నుండి  తనకు  ముందుగా  నిర్ణయించుకున్న కార్యక్రమాలు  ఉన్నాయని ఆ లేఖలో  కవిత  తెలిపారు.  ఈ కార్యక్రమాల నేపథ్యంో విచారణకు  రాలేనని  కవిత   చెప్పారు.  

ఇవాళ  ఉదయం కల్వకుంట్ల కవితకు  ఈడీ  అధికారులు నోటీసులు పంపారు.  రేుపు విచారణకు  రావాలని ఆ లేఖలో  పేర్కొన్నారు.  నిన్ననే  అరుణ్ రామచంద్ర పిళ్లైని  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్రపిళ్లై  రిమాండ్  రిపోర్టులో  కవిత  పేరు ప్రస్తావించారు దర్యాప్తు అధికారులు.  కవిత  ప్రతినిధిగా అరుణ్ రామచంద్రపిళ్లై  వ్యవహరించారని ఆ  రిపోర్టులో  పేర్కొన్నారు. అరుణ్ రామచంద్ర పిళ్లైని  అరెస్ట్  చేసిన మరునాడే  కవితకు  నోటీసులు  జారీ చేశారు.

ప్రస్తుతం ఈడీ కస్టడీలో   ఉన్న  అరుణ్  రామచంద్ర పిళ్లైతో  కలిపి కవితను  విచారించే అవకాశం లేకపోలేదు.  ఈ కారణంగానే ఆమెను రేపు విచారణకు  రావాలని కోరినట్టుగా  నోటీసులు  ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ విషయమై కవిత  ఇవాళ  ఈడీకి  సమాధానం ఇచ్చారు.  కవిత రాసిన లేఖపై  ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారోననే విషయమై  ప్రస్తుతం  ఉత్కం ఠ నెలకొంది. 

also read:కవితకు నోటీసులతో మాకేం సంబంధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

గత ఏడాది డిసెంబర్ మాసంలో  విచారణకు  రావాలని  సీబీఐ నోటీసులు జారీ చేసింది. తొలుత డిసెంబర్  6న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.  అయితే   ఆ రోజున తనకు  వేరే కార్యక్రమాలున్నాయని కవిత  సీబీఐకి తెలిపింది. మరో రోజున విచారణకు  సమయం కావాలని లేఖ రాసింది. కవిత  వినతి మేరకు  సీబీఐ అధికారులు డిసెంబర్  11న కవితను  ప్రశ్నించారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu