Road Accident: రెండు కార్లు ఢీ.. కొడంగల్‌లో ముగ్గురి మృతి

Published : Apr 27, 2025, 06:25 PM IST
Road Accident: రెండు కార్లు ఢీ.. కొడంగల్‌లో ముగ్గురి మృతి

సారాంశం

Road Accident: కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.  

Road Accident: వికారాబాద్ జిల్లాలోని కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆదివారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు బాధితులు కర్ణాటకలోని దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ఎస్సై సత్యనారాయణ తెలిపారు. చిట్లపల్లి - యలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై వారి కారును ఒక SUV ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. 

మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు