
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ఒడిశా, ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై ఆవరించిందని తెలిపింది.
ఈ ఆవర్తనం ఫలితంగా తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి ప్రకటించారు. రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అంతేకాదు తెలంగాణ తో పాటు ఆంధ్రలో కూడా ఈ ప్రభావం ఉంటుందని, అక్కడ వర్షాలు మోస్తారు నుండి భారీ స్థాయిలో కురువనున్నట్లు ఆయన తెలిపారు.