
తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు మండుటెండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు చేస్తుండగా, మరోవైపు సాయంత్రానికి మేఘాలు కమ్ముకొని వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వానలు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎండావాన పరిస్థితులు కొనసాగనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.