నకిలీ ఐపీఎల్ టికెట్లు విక్రయం.. రాచకొండ పోలీసుల అదుపులో ముఠా , తీగ దొరికిందిలా..?

Siva Kodati |  
Published : Apr 27, 2023, 07:04 PM IST
నకిలీ ఐపీఎల్ టికెట్లు విక్రయం.. రాచకొండ పోలీసుల అదుపులో ముఠా , తీగ దొరికిందిలా..?

సారాంశం

హైదరాబాద్ రాచకొండ పోలీసులు నకిలీ ఐపీఎల్ టికెట్ల ముఠా గుట్టును రట్టు చేశారు.  నల్గొండకు చెందిన కోమటిరెడ్డి గోవర్థన్ రెడ్డితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.

దేశం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఫీవర్‌తో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులు తమ జట్లను, అభిమాన ఆటగాళ్ల ఆటను చూసేందుకు గ్రౌండ్లకు పోటెత్తుతున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రాచకొండ పోలీసులు నకిలీ ఐపీఎల్ టికెట్ల ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.

బార్ కోడ్ ద్వారా నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేస్తోంది ఈ ముఠా. నల్గొండకు చెందిన కోమటిరెడ్డి గోవర్థన్ రెడ్డితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా భారీగా నకిలీ ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు వందలాది ఐపీఎల్ టికెట్లను ఈ ముఠా విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత మ్యాచ్‌లో నకిలీ ఐపీఎల్ టికెట్ల వ్యవహారాన్ని గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు