పెరుగుతున్న కేసులు: తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు రీ ఓపెన్, ప్రభుత్వం ఆదేశాలు

Siva Kodati |  
Published : Apr 03, 2021, 06:41 PM ISTUpdated : Apr 03, 2021, 06:47 PM IST
పెరుగుతున్న కేసులు: తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు రీ ఓపెన్, ప్రభుత్వం ఆదేశాలు

సారాంశం

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో క్వారంటైన్ సెంటర్‌ను సందర్శించారు కలెక్టర్ శ్వేతా మహంతి. అలాగే క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించింది. 

మరోవైపు తెలంగాణపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1078 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

వైరస్‌ కారణంగా ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1712కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శనివారం బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా 331 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 283 ఉన్నాయి. శుక్రవారం 59,705 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా