కాంగ్రెస్ మెంబర్‌షిప్‌తో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్: అందించిన ప్రియాంక గాంధీ

Published : May 08, 2023, 07:43 PM IST
కాంగ్రెస్ మెంబర్‌షిప్‌తో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్: అందించిన  ప్రియాంక గాంధీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కులను  ఆ పార్టీ అగ్రనేత  ప్రియాంక  గాంధీ ఇవాళ అందించారు.


హైదరాబాద్:   కాంగ్రెస్ పార్టీ  సభ్యత్వం  తీసుకొనన్న  వారికి ఇన్సూరెన్స్ చెక్కులను  కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  ప్రియాంక గాంధీ   సోమవారంనాడు అందించారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం  తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ ను ఈ దఫా అమలు  చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో   తెలంగాణ రాష్ట్రం  అగ్రస్థానంలో  నిలిచింది. పార్టీ సభ్యత్వం  తీసుకున్న  140 మంది  పార్టీ కార్యకర్తలకు  ప్రియాంక గాంధీ  చెక్కులను అందించారు. 

also read:తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కఠినమైంది: యూత్ డిక్లరేషన్ విడుదల చేసిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం  తీసుకున్న  వారికి  రెండు లక్షల ఇన్సూరెన్స్ను అందించింది కాంగ్రెస్ పార్టీ . తెలంగాణలో  సుమారు  30 లక్షల సభ్యత్వం  చేర్పించింది  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. పార్టీ సీనియర్లు కూడా  సభ్యత్వ సేకరణలో పాల్గొన్నారు.   సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా  గత ఏడాది సభ్యత్వ నమోదు  ప్రక్రియ నిర్వహించారు.  సభ్యత్వ నమోదు  పూర్తైన తర్వాత  ఎన్నికలు నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu