అతిగా మద్యం తాగి నిండు గర్భిణీ మృతి.. చిట్యాలలో విషాదం...

By SumaBala BukkaFirst Published Jan 10, 2022, 9:56 AM IST
Highlights

శనివారం రాత్రి కూడా  నిండు గర్భిణి అయిన లింగమ్మ, బాల్ రెడ్డి ఇద్దరూ ఇంట్లోనే మద్యం తాగారు. ఆదివారం ఉదయం చూసేసరికి లింగమ్మ మృతి చెంది ఉంది. అయితే, అతిగా మద్యం తాగడం వల్లే ఆమె చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

చిట్యాల :  మరో నాలుగు రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉన్న Pregnant woman అతిగా alcohol తాగి మృతి చెందింది. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలానికి చెందిన లింగమ్మ (26) భర్తను వదిలేసింది. శివనేనిగూడెం గ్రామానికి చెందిన బాల్ రెడ్డి (45)ని చాలా ఏళ్ల క్రితమే భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో కూలి పనికి వెళ్లే బాల్ రెడ్డి కి..  సంచార జాతికి చెందిన లింగమ్మ తో పరిచయం ఏర్పడింది.

దీంతో లింగమ్మ కొద్దిగా కాలంగా బాల్ రెడ్డితో సహజీవనం చేస్తోంది. అయితే వీరిద్దరికీ రోజు మద్యం తాగే అలవాటు ఉంది. శనివారం రాత్రి కూడా  నిండు గర్భిణి అయిన లింగమ్మ, బాల్ రెడ్డి ఇద్దరూ ఇంట్లోనే మద్యం తాగారు. ఆదివారం ఉదయం చూసేసరికి లింగమ్మ మృతి చెంది ఉంది. అయితే, అతిగా మద్యం తాగడం వల్లే ఆమె చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 7వ తారీకున మంచిర్యాల జిల్లాలో ఇలాంటి దారుణ విషాదమే చోటు చేసుకుంది. రెండో కాన్పులోనూ girl child పుడుతుందేమో అనే Suspicionతో ఓ నిండు Pregnant ఉరివేసుకుని Suicide చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. 

ఈ విషాద ఘటన Manchiryalaలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నర్సాపూర్ కు చెందిన రమ్యను మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆనంద్ కు ఇచ్చి 2017 లో వివాహం చేశారు. వీరి సంసార జీవితంలో మొదటగా ఆరాధ్య(3) జన్మించింది. ప్రస్తుతం రమ్య 9 నెలల గర్భిణీ. గురువారం ఆమెకు వైద్యులు డెలివరీ డేటును ఖరారు చేశారు. 

అయితే, తనకు మొదట ఆడపిల్ల పుట్టిందని.. ఇప్పుడు కూడా అమ్మాయే పుడుతుందేమోనని గత కొద్ది రోజులుగా రమ్య దిగులు పడుతోంది. ఈ విషయం గమనించిన భర్త ఆడపిల్లయినా, మొగ పిల్లవాడైన ఏమీ కాదని నచ్చచెప్పేవాడు. భర్తతోపాటు అత్తింటివారు, పుట్టింటి వారు కూడా అదే విషయం నచ్చజెప్పేవారు. అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దని కూడా చెప్పేవారు. కానీ రమ్య మనసులో ఏముందో ఏమో.. కానీ ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ‘ఎంత పని చేస్తివి బిడ్డా..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏడుస్తున్న తీరుతో జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. అది చూస్తున్న స్థానికులను కలచివేసింది. ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుడుతుంది అనే అనుమానంతో తనువు చాలించడం ఏంటని అయిన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు. 

click me!