సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: కాచీబౌలి కాలనీవాసుల తరలింపు

By narsimha lodeFirst Published Jan 19, 2023, 3:40 PM IST
Highlights

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట  డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో  జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న కాచీబౌలీ  కాలనీని  పోలీసులు ఖాళీ చేయించారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని  డెక్కన్ నైట్ వేర్ స్టోర్  దుకాణంలో  అగ్ని ప్రమాదం కారణంగా  పక్కనే ఉన్న కాచీబౌలి కాలనీని పోలీసులు ఖాళీ చేయించారు.. మంటలను  ఈ కాలనీకి వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  ఒకవేళ  మంటలు వ్యాపించినా పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా  ఉండేందుకు గాను  ఈ కాలనీలో  గ్యాస్ సిలిండర్లను పోలీసులు  దూరంగా తరలిస్తున్నారు.   ఈ భవనంలో  సింథటిక్,  రెక్సిన్  వంటి  పదార్ధాలు  ఉండడంతో  మంటలు మళ్లీ వ్యాపించాయి.   కింది  ఫ్లోర్ నుండి   మంటలు  భవనం మొత్తం వ్యాపిస్తున్నాయి.  

మంటల ధాటికి  అద్దాలు పగిలిపోతున్నాయి. అంతేకాదు  మంటలధాటికి  భవనంలో  శబ్దాలు విన్పిస్తున్నాయి.  ఈ భవనంలో  ఎనిమిది సిలిండర్లు  ఉన్నాయని  ఈ భవనం నుండి బయటపడిన సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే ఈ సిలిండర్లను  బయటకు తెచ్చేందుకు  రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు. మంటల ధాటికి  సిలిండర్లు  పేలిపోయే అవకాశం ఉన్నందున  అధికారులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  మంటల ధాటికి భవనం కూడా  దెబ్బతిని కూలిపోయే అవకాశం ఉన్నందున  భవనం  చుట్టుూ ఎవరూ లేకుండా  ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు  10 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి.  డెక్కన్  నైట్ వేర్ దుకాణంలోని ఐదు అంతస్థుల్లో  మంటలు వ్యాపించాయి.  గాలి తీవ్రత కారణంగా  పక్క భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి,. ఈ ప్రమాదాన్ని గుర్తించిన  అధికారులు  ముందే ఈ భవనంలోని వారిని ఖాళీ చేయించారు.

also read:సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో అగ్నిప్రమాదం: రెస్క్యూకు వెళ్లిన ముగ్గురికి అస్వస్థత

మంటల తీవ్రతకు  ఫైర్ ఫైటర్లు  కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  మటలు తీవ్రతతో వేడి  బయటకు వస్తోంది.  ఈ భవనం వెనుక వైపు నుండి  మంటలను ఆర్పే ప్రయత్నాలను అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు.  భవనం ముందు వైపు నుండి  మంటలను ఆర్పేందుకు  చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు.  ఈ భవనంలో  మంటలు అదుపులోకి రావడానికి ఇంకా  సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు  అంచనా వేస్తున్నారు.  

click me!