
ఖమ్మం: ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ సభను నిర్వహించనున్నారు.ఈ సభ నిర్వహణ కోసం పోలీసుల అనుమతిని కోరారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.తెలంగాణలో పార్టీ ఏర్పాటు కోసం షర్మిల అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 16వ తేదీన ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో నిర్వహించే సభలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్టుగా ఆమె తెలిపారు.
also read:ఏప్రిల్ 9న పార్టీ: ఖమ్మంలో ప్రకటించనున్న షర్మిల
ఈ సభ నిర్వహణ కొరకు షర్మిల సన్నిహితులు ఖమ్మం పోలీసులను అనుమతి కోరారు. ఈ సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ తో పాటు మరో గ్రౌండ్ లో సభ నిర్వహణ కోసం అనుమతి ఇచ్చినట్టుగా షర్మిల వర్గీయులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధించేందుకు గాను తాను ప్రజల ముందుకు వస్తున్నట్టుగా ఆమె తెలిపారు.