గుడిసెలో తవ్విన కొద్దీ పాము పిల్లలు.. !!

Published : Mar 17, 2021, 09:16 AM IST
గుడిసెలో తవ్విన కొద్దీ పాము పిల్లలు.. !!

సారాంశం

మహబూబ్ నగర్ లో ఓ వింత జరిగింది. ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వితే పాము పిల్లలు బయట పడి కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గుడిసెలో అప్పటివరకు నివసిస్తున్న మూడు కుటుంబాలు గజగజా వణికిపోయాయి.

మహబూబ్ నగర్ లో ఓ వింత జరిగింది. ఓ పూరి గుడిసెలో మట్టిని తవ్వితే పాము పిల్లలు బయట పడి కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 పాము పిల్లలు బయటపడ్డాయి. దీంతో ఆ గుడిసెలో అప్పటివరకు నివసిస్తున్న మూడు కుటుంబాలు గజగజా వణికిపోయాయి.

వివరాల్లోకి వెడితే.. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలోని గవర్నమెంట్ కాలేజ్ వెనక భాగంలో ఉండే గుడిసెల్లో మూడు కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గుడిసెల్లో బుడగజంగం చిన్న కుర్మన్న ఉంటున్న గుడిసెలో దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో గుడిసెలో ఓ మూల మట్టిని తవ్వారు. 

ఆ మట్టిలోనుండి మొదట ఒక పాము పిల్ల బైటికి వచ్చింది. దాన్ని చంపుదామనుకునేలోపు.. ఒకదానివెంట ఒకటిగా వరుసగా మొత్తం 21 పాము పిల్లలు బైటికి వచ్చాయి. వాటిని కర్రతో కొట్టి చంపేశారు. అయితే పది రోజుల కిందట ఇదే గుడిసెలో ఓ పెద్ద పాము కనిపించింది. దాన్ని కూడా ఇలాగే చంపేశారు. గుడిసెలో వీరితో పాటు ఆరుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కాగ ఎవరికీ అపాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో Netflix | CM Revanth Reddy కీలక ప్రసంగం | Netflix | OTT Platform | Asianet News Telugu
Netflix Eyeline Studios : లండన్, సియోల్ తర్వాత హైదరాబాద్‌లోనే.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రత్యేకతలివే !