ఖమ్మంలో అమానుషం... పురిట్లో బిడ్డను వదిలించుకున్న కసాయి తల్లి

Published : Jan 01, 2023, 09:14 AM ISTUpdated : Jan 01, 2023, 09:19 AM IST
ఖమ్మంలో అమానుషం... పురిట్లో బిడ్డను వదిలించుకున్న కసాయి తల్లి

సారాంశం

నవమాసాలు కడుపులో మోసిన బిడ్డ ఆడదని తెలిసి అత్యంత కర్కశంగా వ్యవహరించిందో కసాయి తల్లి. పేగుబంధాన్ని మరిచిన మహిళ పురిట్లోని బిడ్డను హాస్పిటల్లోనే వదిలివెళ్లిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. 

ఖమ్మం : అదీ ఇదని కాదు మగవారితో సమానంగా అన్నిరంగాల్లోనూ రాణిస్తూ 'ఆడది అబల కాదు సభల' అని ఈ లోకానికి చాటిచెబుతున్నారు నేటి తరం మహిళాలోకం. దేశాధినేతలుగా పాలిస్తున్నారు, సీఈవోలుగా రాణిస్తున్నారు, ఉద్యోగులుగా కుటుంబారాన్ని మోస్తున్నారు. అయినా మహిళలపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ఓ మహిళ ప్రథమ పౌరురాలిగా వున్న మనదేశంలో ఇప్పటికీ అమ్మాయి పుడితే భారంగా భావించే తల్లిదండ్రులే ఎక్కువగా కనిపిస్తారు. ఇలాంటి ఓ కసాయి తల్లిదండ్రులు ప్రేమానురాగాలు, కడుపుతీపిని మరిచి పురిట్లోని ఆడబిడ్డను హాస్పిటల్లోనే వదిలేసి కాదు కాదు వదిలించుకుని వెళ్లిన అమానుషం ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. 

పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఓ మహిళ ప్రసవం జరిగింది. మగబిడ్డ పుడతాడని మహిళతో పాటు కుటుంబసభ్యులు భావించగా వారి ఆశలు తలకిందులై ఆడ బిడ్డ పుట్టింది. దీంతో ఆ తల్లిందండ్రులు పేగుబంధాన్ని మరిచి అమానవీయంగా వ్యవహరించారు. పురిట్లోని బిడ్డను హాస్పిటల్లోనే వదిలేసి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. 

Read More  పల్నాడు జిల్లా : సత్తెనపల్లిలో శిశువు కిడ్నాప్‌కు కిలాడీ లేడీ విఫలయత్నం

ఊయలలో శిశువు ఆకలితో గుక్కపట్టి ఏడవడంతో హాస్పిటల్ సిబ్బంది గమనించారు. ఆ చిన్నారిని తల్లిదండ్రులు కావాలనే వదిలివెల్లినట్లు గుర్తించి పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు వుండి అనాధగా మారిన బిడ్డను ఖమ్మం శిశుగృహకు తరలించారు అధికారులు. అక్కడే ఆ పసిగుడ్డును పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !