
తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో స్థానం లేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఓ బచ్చా అని, సీఎంను విమర్శించే స్థాయి అతనిది కాదని నాయిని విమర్శించారు.
నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు డబ్బులతో, డైరెక్షన్ లో.. చచ్చిపోయిన టీడీపీని కాపాడుకోవడానికి రేవంత్ విన్యాసాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ విలువలు దిగచార్చవద్దని రేవంత్కు హితవు పలికారు.
సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు కేటాయించామనీ, 9 గంటల నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని అభివృద్ధి చేసి భూగర్భజలాలను పెంచామని చెప్పుకొచ్చారు.