ఎవరు చంపారు ?

First Published Nov 23, 2016, 3:14 PM IST
Highlights
  • నయీం అనుచరుడి అనుమానాస్పద మృతి
  • చనిపోయింది టిఆర్ఎస్ ఎంటిటిసి సభ్యుడు
  • నాలుగు నెలలుగా గాలిస్తున్న పోలీసులు

గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులపై ప్రతికార దాడులు మొదలయ్యాయి?.. అంటే అనుమానం కలగమానదు. నయీం హత్య  జరిగిన తర్వాత సినిమా థ్రిల్లర్ ను తలపించేలా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 

తాజాగా నయీం ముఖ్య అనుచరుడు ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నయీం ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి  తప్పించుకు తిరుగుతున్న టీఆర్‌ఎస్ ఎంపిటిసి సభ్యుడు పుల్లరి మహేష్ అలియాస్ ప్రసాద్ బుధవారం సిద్దిపేటలోని ఓ ఇంట్లో చనిపోయాడు.

 

మహేష్ కోసం కొన్ని రోజులుగా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆరు హత్యల్లో మహేష్ నిందితుడిగా ఉన్నారు.  నయీంతో కలసి భూ దందాల్లో పాల్గొన్నాడు.


మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

click me!