మునుగోడు బైపోల్ 2022: చండూరులో రేపు లెఫ్ట్ పార్టీల సభ

Published : Oct 09, 2022, 03:01 PM IST
 మునుగోడు బైపోల్ 2022: చండూరులో రేపు లెఫ్ట్ పార్టీల సభ

సారాంశం

రేపు చండూరులో లెఫ్ట్ పార్టీలు సభను నిర్వహించనున్నాయి.మునుగోడులోఉప ఎన్నికల్లో సీపీఐ,సీపీఎంలు టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించాయి. 

హైదరాబాద్:మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతుగా లెఫ్ట్ పార్టీలు సోమవారం నాడు సభను నిర్వహించనున్నాయి.  ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 3 వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉపఎన్నికను పురస్కరించుకొని  లెఫ్ట్  పార్టీలు ఈ సభను  ఏర్పాటు చేశాయి. మునుగోడు అసెంబ్లీ స్థానంలో లెఫ్ట్ పార్టీలకు గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇప్పటివరకు 12 దఫాలు ఎన్నికలు జరిగితే ఆరు దఫాలు కాంగ్రెస్ , ఐదు సార్లు సీపీఐ అభ్యర్ధులు విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు లెఫ్ట్ పార్టీలనుకోరాయి. ఈ ఏడాది ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు.  ఈ సమావేశంలో మునుగోడులో   ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై చర్చించారు.  టీఆర్ఎస్  కు మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది ఆగస్టు 20న మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర సమితి సహయ కార్యదర్శి పల్లావెంకట్ రెడ్డి ప్రకటించారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది సీపీఎం.,  గత మాసంలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ  సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎం నేతలు టీఆర్ఎస్  కు మద్దతిస్తున్నట్టుగా  ప్రకటించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంపై మంత్రి జగదీష్ రెడ్డి  గత వారంలో సీపీఐ, సీపీఎం నేతలతో  సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో అనుపరించాల్సిన  ప్రచార వ్యూహంపై చర్చించారు.ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రేపు చండూరులో లెఫ్ట్ పార్టీలు సభను నిర్వహించనున్నాయి. ఈ సభలో సీపీఐ  రాష్ట్ర సమితికార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శిచాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.

also read:మునుగోడులో 200 కార్లు, 2 వేల మోటారు బైక్ లు బీజేపీ బుక్ చేసింది: హరీష్ రావు సంచలనం

మునుగోడు అసెంబ్లీనియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలోని లెఫ్ట్ పార్టీల  క్యాడర్ టీఆర్ఎస్ కు  సహకరించేందుకు సిద్దంగా లేరని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్  నాయకత్వం భావిస్తుంది. అయితే  ఏ పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలనినిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని లెఫ్ట్ నేతలు మరోసారి వివరించనున్నారు. మునుగోడులో ఉన్న పరిస్థితులు రానున్నరోజుల్లో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలపై  లెఫ్ట్ పార్టీలు తమ వైఖరిని ప్రకటించనున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu