సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. మోహన్ బాబు మేనేజర్ ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. మోహన్ బాబు మేనేజర్ ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూ.లక్ష నగదు, విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసుకు ఫిర్యాదు అందించింది. కాగా.. పనిమనిషి మీదే వాళ్లు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
కాగా.. గతంలో సినీ హీరో చిరంజీవి ఇంట్లో కూడా ఇలానే చోరీ జరిగింది. ఇరు ఇంట్లో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్న వ్యక్తే రూ.2లక్షలు చోరీ చేశాడు. కాగా.. ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో ఇదే రీతిలో చోరీ జరిగింది.