కొడుకుతో కలిసి తండ్రి ఆత్మహత్య, ఏడో తరగతిలో మార్కులు తక్కువగా వచ్చాయని...

First Published Jun 21, 2018, 11:58 AM IST
Highlights

మొదట కొడుకును చెరువులో తోసి...ఆ తర్వాత తాను దూకి....

కొడుకు సరిగ్గా చదవడం లేదని, మంచి మార్కులు సంపాధించడం లేదని కలత చెందిన తండ్రి ఆ కొడుకుతో కలిసి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మొదట కొడుకును చెరువులో తోసేసిన తండ్రి ఆ తర్వాత తాను కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. జనగామ జిల్లా కుందారం గ్రామానికి చెందిన శ్రీధర్ తన భార్య రజని పిల్లలు తేజ,కార్తిక్ లతో కలిసి హైదరాబాద్ జవహార్ నగర్ లో నివాసముంటున్నాడు. ఇతడు అక్కడే ఓ మెడికల్ షాప్ ను నిర్వహిస్తున్నాడు.

అయితే అతడి కుమారుడు ఇటీవలే ఏడో తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ అందులో తక్కువ మార్కులు రావడం శ్రీధర్ అవమానంగా బావించాడు. దీంతో తీవ్రంగా బాధపడుతూ డిప్రెషన్ లో ఉన్న శ్రీధర్ ని ఓ విషయంలో తప్పుగా వ్యవహరించావంటూ తండ్రి మందలించాడు. 

దీంతో మరింత బాధలోకి వెళ్లిన శ్రీధర్ దారుణ నిన్ణయం తీసుకున్నాడు. తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తేజను తీసుకుని బయటకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పిన శ్రీధర్ నేరుగా ఓ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. మొదట కుమారుడిని చెరువులో తోసేసి తానూ దూకాడు. దీంతొో ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు.
 
చెరువలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మృతదేమాలను బైటికి తీయించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే ఆ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

click me!