KTR: "త్వరలోనే బీఆర్ఎస్ విలువ తెలుస్తుంది"

Published : Feb 03, 2024, 11:28 PM IST
KTR: "త్వరలోనే బీఆర్ఎస్ విలువ తెలుస్తుంది"

సారాంశం

KTR: గడిచిన పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా కరెంట్ పోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కరెంట్ కష్టాలుమొదలయ్యాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు.  

KTR: అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఓటర్లు బుద్ధిపూర్వకంగా పార్టీకి ఓటేశారని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో మోసపూరిత హామీలతో  కాంగ్రెస్‌ మోసం చేసిందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు (కేటీఆర్‌) వ్యాఖ్యానించారు.శనివారం కూకట్‌పల్లిలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ.. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదనీ, భారీ మెజారిటీతో BRS కు భారీ విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. కానీ దురదృష్టవశాత్తు.. గ్రామీణ తెలంగాణాలో, కొంతమంది ఓటర్లు కాంగ్రెస్ 420 హామీలను నమ్మారనీ,  అలా నమ్మడంతో చాలా చోట్ల చాలా తక్కువ తేడాతో ఓడిపోయామ్మారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.85 శాతం ఓట్లు వస్తే, బీఆర్‌ఎస్‌కు 37 శాతం ఓట్లు వచ్చాయనీ,  బీఆర్ఎస్ కేవలం 1.85% తేడాతో ఓడిపోయిందని అన్నారు. 
 
బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిందని కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ అన్నారు. తాము రెండుసార్లు ఎన్నికైనందున తాము నిరాశ చెందాము కానీ విచారంగా లేమన్నారు. తాము కష్టపడి పనిచేశామనీ, ఈసారి ఏ కారణం చేతనైనా ప్రతిపక్షంలో ఉండమని కోరుకుంటున్నామని అన్నారు. ఇది ఒక విధంగా మంచి విషయమే...కాంగ్రెస్ ప్రభుత్వ దురభిప్రాయాలను అర్థం చేసుకున్న తర్వాత ప్రజలు BRS విలువను అర్థం చేసుకుంటారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నారని ఆయన అన్నారు.

గత 10 ఏళ్లలో హైదరాబాద్‌లో కరెంటు కోతలు లేవని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. ఎన్నికల హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామన్న ప్రకటించిన కాంగ్రెస్ అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి డిసెంబరు 9న ఫైల్‌పై సంతకం చేస్తానని హామీ ఇచ్చారనీ, జనవరి 9 పోయింది,ఇప్పుడు కొద్ది రోజుల్లో ఫిబ్రవరి 9 కూడా వస్తుందనీ,  ప్రతిపక్షంగా తాము ముఖ్యమంత్రికి గుర్తు చేయడం మా బాధ్యత అన్నారాయన. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu
DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue