హెచ్ఆర్ సి లో కోదండరాం ఫిర్యాదు

Published : Nov 04, 2016, 09:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
హెచ్ఆర్ సి లో కోదండరాం ఫిర్యాదు

సారాంశం

స్పందించిన హెచ్ఆర్ సి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం

ఖమ్మం జిల్లాలో ప్రబలిన విషజ్వరాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ఇవాళ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. జిల్లాలోని బోనకల్‌ మండలం రావినూతలలో విషజ్వరాల బారినపడి న గిరిజనులకు సరైన చికిత్స అందడం లేదని దీనిపై వెంటనే చర్యలు తీసుకోని  బాధిత కుటుంబాలను ఆదుకోనేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన ఫిర్యాదులో కోరారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్ సి 15 రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

Breezer: నో స్టాక్‌.. తెలంగాణ బ్రీజ‌ర్లు ఎందుకు దొర‌క‌డం లేదో తెలుసా.?
Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్