- క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
పెరేడ్ గ్రౌండ్ లో సచివాలయం ఏర్పాటు అంశం వివాదం అవుతుండటంతో సీఎం కేసీఆర్ దీనిపై స్పందించారు.
తాము కేంద్రం నుంచి తీసుకుంటుంది బైసన్ పోలో స్థలం మాత్రమేనని పెరేడ్ గ్రౌండ్ స్థలం కాదని వివరణ ఇచ్చారు. పెరేడ్ గ్రౌండ్, బైసన్ పోలో రెండు పక్కపక్కనే ఉంటాయిని స్పష్టం చేశారు.
పెరేడ్ గ్రౌండ్ లో తాము సచివాలయ నిర్మాణం చేపట్టడం లేదని అక్కడ ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.