మోదీ వెంటే మీమంతా

Published : Dec 16, 2016, 02:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మోదీ వెంటే మీమంతా

సారాంశం

ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పిన సీఎం కేసీఆర్

పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచల నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని  సీఎం కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీ లో ప్రకటించారు.

 

దేశ ప్రయోజనాలకోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నదని తెలిపారు.

 

అదే సమయంలో అన్ని రూపాల్లో ఉన్న నల్ల ధనాన్ని నిర్మూలించే దిశగా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు.

 

ఈ ప్రక్రియ సంపూర్ణ క్రాంతిని సాధించేవరకు కొనసాగించినపుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని ప్రభుత్వం బలంగా నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు.

 

ఈ అంశం అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సాధకబాధకాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో, ఆర్‌బీఐతో ఎప్పటికప్పడు సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు.

 

రాష్ట్రానికి అవసరమైన సుమారు 5వేల కోట్ల రూపాయలను చిన్ననోట్ల రూపంలో పంపించవలిసిందిగా లేఖలో ఆర్ బి ఐ కి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు.




కాగా,  రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు.

ఇప్పటికే అదే నియజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చినట్లు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu