అసెంబ్లీలో సినీ నటుడు నాగార్జునపై చర్చ

Published : Dec 16, 2016, 09:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అసెంబ్లీలో సినీ నటుడు నాగార్జునపై చర్చ

సారాంశం

వివాదాస్పద ఎన్ కన్వెన్షన్ పై రేవంత్ ప్రశ్న చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ విజయవంతంగా అమలవుతోందని  జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్‌ కాకతీయపై ఆయన వివరణ ఇచ్చారు.

 

 

ఈ సందర్భంగా టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెరువులను కబ్జా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొందని, అయితే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆరోపించారు. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్

 

 

హైటెక్ సిటీ సమీపంలో ఉండే తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు.

 

స్వయంగా జీహెచ్ఎంసి సర్వే చేసి నాగార్జున కబ్జా చేసిన విషయాన్ని ధృవీకరించారని పేర్కొన్నారు. నాగార్జున కూడా దీనిపై స్పందించారని గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

Tomato Price : టమాటా ధరలు ఢమాల్.. హైదరాబాద్ లో కిలో ధర ఎంతో తెలుసా?
36 ఏళ్ల క్రితం మాదాపూర్‌లో గజం ధ‌ర ఎంత ఉండేదో తెలుసా? లక్ష పెట్టుడి పెట్టుంటే, నేడు కోటీశ్వ‌రుల‌య్యేవారు