
హైదరాబాద్: Hyderabad కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన మూడు Real Estate సంస్థల్లో భారీగా నగదును ఆదాయపన్నుశాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.హైద్రాబాద్లోని మూడు రియల్ ఏస్టేట్ సంస్థల్లో నాలుగు రోజలు పాటు సోదాలు నిర్వహించారు. ఈ రియల్ ఏస్టేట్ సంస్థల్లో రూ.800 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా income tax గుర్తించారు.
నగరంలోని Navya డెవలపర్స్, రాఘమయూరి ఇన్ఫ్రా, స్కంధాన్షీ రియల్ ఏస్టేట్ సంస్థలపై ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మూడు సంస్థలు సుమారు రూ. 800 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్టుగా సమాచారం. ఈ సంస్థల నుండి సుమారు రూ. 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు.
ఆదాయ పన్ను శాఖాధికారులకు చిక్కకుండా ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేసుకొని నగదు లావాదేవీలు జరిపినట్టుగా ఐటీ శాఖాదికారులు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను కూడా రియల్ ఏస్టేట్ సంస్థ ప్రతినిధులు ధ్వంసం చేశారు. భూములను కొనుగోలు చేసిన సమయంలో నగదును Banks ద్వారా చేయకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. హైద్రాబాద్, అనంతపూర్, కర్నూల్, వైజాగ్ , కడప, నంద్యాల, బళ్లారిలో సోదాలు నిర్వహించారు.