జీరో షాడో డే: హైద్రాబాద్‌లో మాయమైన నీడ

Published : May 09, 2023, 01:02 PM IST
 జీరో షాడో డే: హైద్రాబాద్‌లో  మాయమైన  నీడ

సారాంశం

హైద్రాబాద్  నగరంలో  ఇవాళ   మధ్చాహ్నం కొన్ని క్షణాల పాటు  నీడ కన్పించలేదు.    జీరో షాడో ను  చూసేందుకు  ప్రజలు  ప్రయత్నించారు.  

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో   మంగళవారంనాడు మధ్యాహ్నం   నీడ  కన్పించలేదు.. ఇవాళ మధ్యాహ్నం  12:12 గంటలకు  నీడ  జాడ మాయమైంది.   ఈ సమయంలో  నీడ లేకుండా ఎలా ఉందో  చూసేందుకు  ప్రజలు  ప్రయత్నించారు. జీరో షాడోను ప్రజలు తిలకించేందుకు గాను  బిర్లా ప్లానిటోరియం పెద్ద ఎత్తున ఏర్పాట్లు  చేసిన  విషయం తెలిసిందే.

 ఏదైనా వస్తువుపై  సూర్యకిరణాలు పడితే  నీడ కన్పిస్తుంది.  అయితే  ఇవాళ  మధ్యాహ్నం 12:12 గంటలకు మాత్రం  నీడ కన్పించకుండా  పోయింది. అయితే  ప్రతి ఏడాది  రెండు  రోజుల పాటు  నీడ లేని రోజులు కన్పిస్తుంటాయి. ఈ ఏడాది మే 9వ తేదీన ఆగస్టు  3వ తేదీల్లో  జీరో షాడో కన్పించనుంది. 

భూమి, సూర్యుడి మధ్య  రేఖను  సౌరక్షీణత రేఖగా  పిలుస్తారు. ఈ సౌరక్షీణత  సూర్యకిరణాలు  పడే అక్షాంశానికి   సమానమైనప్పుడు  జీరో షాడో ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే  ఈ ఏడాది ఏప్రిల్ 25న జీరో షాడో  డే  కన్పించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu