ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్‌ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. నిందితుల్లో ఐదుగురు మహిళలు

Published : Jan 08, 2022, 04:05 PM IST
ఢిల్లీలో ఫేక్ కాల్ సెంటర్‌ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. నిందితుల్లో ఐదుగురు మహిళలు

సారాంశం

ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ (Fake call centre) నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని ఈ ముఠా మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. 

ఢిల్లీలో నకిలీ కాల్ సెంటర్ (Fake call centre) నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగుల్ని ఈ ముఠా మోసగించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు నిర్వాహకులుతో పాటు ఐదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 8 మందిని పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తోంది. 

ఏడాది కాలంగా వారు ఫేక్ కాల్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. గురుగ్రావ్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం వారిని అరెస్ట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్