శంషాబాద్‌లో దారుణం: దొంగతనం చేశారని స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు

Published : Dec 21, 2021, 09:34 AM ISTUpdated : Dec 21, 2021, 09:45 AM IST
శంషాబాద్‌లో దారుణం: దొంగతనం చేశారని స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు

సారాంశం

శంషాబాద్ లో దారుణం చోటు చేసకొంది. వాహనలా బ్యాటరీలను దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరిని స్థానికులు స్థంబానికి కట్టేసి కొట్టారు. అంతేకాదు వారికి గుండు కొట్టించారు.  ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: వాహనాల బ్యాటరీలు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు యువకులను స్థంబానికి కట్టేసి గుండు కొట్టించారు స్థానికులు,  ఈ ఘటనపై బాధితులు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. .Shamshabad లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉండే ఖుద్దూస్, ఖాజాలు old scrap వ్యాపారం చేస్తుంటారు. అయితే వాహనాల battery లను దొంగతనం చేస్తారని వీరిపై ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని వాహనాల బ్యాటరీలు చోరీకి గురౌతున్నాయి.

దీంతో స్థానికులు ఈ బ్యాటరీల కోసం Khaja  ఇంట్లో వెతికితే కొన్ని బ్యాటరీలు లభ్యమయ్యాయి.  ఖాజా, khuddus లు బ్యాటరీలను చోరీ చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని విద్యుత్ స్థంబానికి కట్టేసి చితకబాదారు. అంతేకాదు  మళ్లీ  ఈ తరహాలో చోరీలకు పాల్పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇద్దరికి Head shave చేశారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు.  ఈ అవమానంపై బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను  అవమానపర్చిన ఘటనలో ఐదుగురిని శంషాబాద్ పోలీసులు Arrest చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్