హైదరాబాద్‌లో కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. ఆ యువతి బంధువుల పనేనా?

Published : Jul 03, 2022, 02:35 PM ISTUpdated : Jul 03, 2022, 03:08 PM IST
 హైదరాబాద్‌లో కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. ఆ యువతి బంధువుల పనేనా?

సారాంశం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జిన్నారం అడవుల్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తుంది. 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జిన్నారం అడవుల్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతడిని హత్య చేసి దహనం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మృతదేహం కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డిదిగా గుర్తించారు. వివరాలు.. మృతుడు నారాయణరెడ్డి కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం అతడు ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి నారాయణరెడ్డిని పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. 

ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో నిర్భందించారు. అయితే ఆ తర్వాత కూడా నారాయణ రెడ్డి, యువతి ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అయితే ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు, బంధువులు నారాయణరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రెడ్డిని హత్య చేసి, పెట్రోల్ పోసి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం