గ్రూప్ 2 పై మరో మూడు వారాలు స్టే

Published : Jun 22, 2017, 02:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
గ్రూప్ 2 పై మరో మూడు వారాలు స్టే

సారాంశం

గ్రూప్ 2 విషయంలో సందిగ్థత  ఇంకా కొనసాగుతోంది. టిఎస్సీపిఎస్సి వ్యవహారంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 12న హైకోర్టు గ్రూప్ 2 ప్రక్రియను నిలిపివేస్తూ స్టే విధించింది. దీంతో జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా పడింది.

గ్రూప్ 2 విషయంలో సందిగ్థత  ఇంకా కొనసాగుతోంది. టిఎస్సీపిఎస్సి వ్యవహారంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 12న హైకోర్టు గ్రూప్ 2 ప్రక్రియను నిలిపివేస్తూ స్టే విధించింది. దీంతో జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా పడింది.

ఈ మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టిఎస్పిఎస్సీని ఆదేశించింది హైకోర్టు. కానీ దీనిపై ఇప్పటి వరకు టిఎస్పిఎస్సీ కౌంటర్ దాఖలు చేయలేదు. తాము కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని టిఎస్సిపిఎస్సీ తరుపు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించారు. దీంతో మరో మూడు వారాల పాటు స్టే నుపొడిగిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం