నవీన్ హత్య కేసు: శరీర భాగాలు దగ్దం చేసి బిర్యానీ తిన్న హరిహరకృష్ణ

Published : Mar 07, 2023, 01:12 PM IST
నవీన్   హత్య  కేసు: శరీర భాగాలు దగ్దం  చేసి బిర్యానీ  తిన్న హరిహరకృష్ణ

సారాంశం

నవీన్  హత్య  కేసులో  ఆధారాలు లేకుండా  చేసేందుకు  హరిహరకృష్ణ  ప్రయత్నించినట్టుగా  పోలీసులు  దర్యాప్తులో  గుర్తించారు.  

హైదరాబాద్: నవీన్ శరీరబాగాలను  దగ్దం  చేసిన తర్వాత  హోటల్ కు వెళ్లి  బిర్యానీ తిన్నారు హరిహరకృష్ణ అతని స్నేహితులు.  ఈ కేసు  విషయమై భోజనం చేసే సమయంలో  స్నేహితులతో  హరిహరకృష్ణ చర్చించాడు. నవీన్ ను హత్య చేసిన విషయాన్ని  వెంటనే  తన లవర్ కు, స్నేహితుడు హసన్ కు  హరిహరకృష్ణ చెప్పాడు.    ఈ విషయాన్ని  పోలీసులు దర్యాప్తులో  గుర్తించారు. 

ఈ నెల  17వ తేదీన  రాత్రి  అబ్దుల్లాపూర్‌మెట్  కు సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో  నవీన్ ను  హరిహరకృష్ణ హత్య  చేశాడు.   నవీన్  ను   హత్య  చేసిన తర్వాత  శరీర భాగాలను కోసేసి  హరిహరకృష్ణ  బ్యాగులో  వేసకున్నాడు.  బ్రహ్మణపల్లికి సమీపంలోని  నిర్మానుష్యప్రాంతంలో  ఈ భాగాలను వేశాడు.  బ్రహ్మణపల్లిలోని తన స్నేహితుడు  హసన్  ఇంట్లో  రాత్రి  ఉన్నాడు. స్నానం  చేసి  పడుకున్నాడు.  హసన్  వద్ద దుస్తులు  తీసుకొని  వేసుకున్నాడు. రక్తంతో  తడిసిన దుస్తులను  మరునాడు  దగ్దం చేశారు. 

గత నెల  18వ తేదీన  హైద్రాబాద్  హస్తినాపురంలో  ఉండే  తన లవర్  ఇంటి  సమీపానికి  హరిహరకృష్ణ వెళ్లాడు.   నవీన్ ను హత్య  చేసిన విషయాన్ని  ఆమెకు  హరిహరకృష్ణ చెప్పాడు. 

తన వద్ద డబ్బులు లేవని చెబితే  లవర్  అతనికి రూ. 1500  ఫోన్ పే ద్వారా  పంపిందని  పోలీసులు దర్యాప్తులో  గుర్తించారు. వంరగల్,   నల్గొండ, ఖమ్మం, కోదాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో తి రిగి గత నెల  24న  హైద్రాబాద్  కు తిరిగి వచ్చాడు  హరిహరకృష్ణ.   బ్రహ్మణపల్లి వద్ద  నిర్మానుష్యప్రాంతంలో  వేసిన  నవీన్  శరీరబాగాలను  తీసుకొని  నవీన్  ను హత్య  చేసిన అబ్దుల్లాపూర్ మెట్  ప్రాంతానికి తీసుకెళ్లి  దగ్దం  చేశాడు  హరిహరకృష్ణ.

ఈ సమయంలో  హరిహరకృష్ణలవర్,  హసన్ కూడా ఉన్నాడు. నవీన్  శరీర భాగాలను  హసన్,  హరిహరకృష్ణలు దగ్దం  చేశారు. అనంతరం  అక్కడి నుండి   అంబర్ పేటకు  సమీపంలో  జాతీయ రహదారికి  పక్కగా  ఉన్న హోటల్ లో  ఈ ముగ్గురు బిర్యానీ తిన్నారు. భోజనం  చేసే సమయంలో  ఈ కేసు  గురించి  చర్చించుకున్నారు. పోలీసులు అరెస్ట్  చేస్తారా, లోంగిపోవాలా అనే విషయమై  హరిహరకృష్ణ వీరిద్దరితో  చర్చించినట్టుగా  పోలీసులు  తమ దర్యాప్తులో  గుర్తించారు.  అదే  రోజు సాయంత్రం  హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. 

also read:పచ్చబొట్టు ఆధారంగా నవీన్ డెడ్‌బాడీ గుర్తింపు: తండ్రి శంకర్ నాయక్

ఈ నెల  3వ తేదీన  పోలీసులు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకుని  ప్రశ్నిస్తున్నారు.  అయితే  ఈ కేసు విషయమై  పోలీసుల ప్రశ్నలకు  హరిహరకృష్ణ నుండి  పొంతనలేని సమాధానాలు రావడంతో  పోలీసులు  లోతుగా దర్యాప్తు  చేయాలని భావించారు. హరిహరకృష్ణ లవర్ , హసన్ లతో   కలిపి  హరిహరకృష్ణను   విచారించిన  సమయంలో  కీలక  విషయాలు  వెలుగు చూశాయి.   ఈ కేసులో  హసన్,  హరిహరకృష్ణ లవర్ లను  పోలీసులు  నిన్న  అరెస్ట్  చేశారు. 

  

PREV
click me!

Recommended Stories

CV Anand Takes Charge as Telangana DGP: | Asianet News Telugu
C V Anand Takes Charge as Telangana DGP: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు | Asianet News Telugu